బీహార్లో రెచ్చిపోయిన మావోయిస్టులు

25 May, 2015 09:32 IST|Sakshi

బీహార్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. గయా జిల్లాలోని 32 వాహనాలకు తగులబెట్టారు. బారాచట్టిలో పోలీసుల ఎన్కౌంటర్కు నిరసనగా మావోయిస్టులు ఈ విధ్వంసకర చర్యకు పాల్పడ్డారు. సోమవారం తెల్లవారుజామున మావోయిస్టులు... వాహనాలను ఆపివేసి, అందులోని డ్రైవర్లను కిందకి దింపి అనంతరం వాటికి నిప్పు పెట్టారు. ఈ సంఘటనలో 31 లారీలు, ఓ ఇన్నోవా వాహనం పూర్తిగా దగ్దం అయింది. గత ఆరు నెలలుగా బీహార్లో మావోయిస్టుల కార్యకలపాలు ఊపందుకున్నాయి.  ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


 

మరిన్ని వార్తలు