చాట్ తిని 50 మంది పిల్లలకు అస్వస్థత

17 Oct, 2013 14:57 IST|Sakshi

ఉత్తరప్రదేశ్లో పాశిపోయిన చిరుతిళ్లు తిని 50 మందికిపైగా పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. బిజ్నూరు జిల్లా రాంపూర్ గ్రామంలో రోడ్డు వైపున చాట్ తిన్నారు.

అది విషాహారంగా మారడంతో పిల్లు వాంతులు, కడుపు నొప్పితో అనారోగ్యానికి గురయ్యారు. బాధితుల్ని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనపై విచారణ చేపట్టనున్నట్టు చీఫ్ మెడికల్ ఆఫీసర్ చెప్పారు. కాగా ఎవర్నీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు