క్వారంటైన్‌లో బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్

14 Jul, 2020 17:50 IST|Sakshi
రామ్‌ మాధవ్‌

సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ సమావేశానికి హాజరైన పీఏసీ డైరెక్టర్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో పీఏసీ సమావేశానికి హాజరైన వారందరిని హోం క్వారంటైన్‌కు వెళ్లాల్సిందిగా పార్లమెంట్‌ మంగళవారం పిలుపు నిచ్చింది. ఈ సమావేశంలో ఎంపీ సీఎం రమేష్‌ కూడా పాల్గొన్నారు. అదే విధంగా జమ్మూ కశ్మీర్‌ బీజేపీ అధ్యక్షుడికి కూడా కరోనా పాజిటివ్‌ రావడంతో బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ హోం క్వారంటైన్‌కు వెళ్లారు. రెండు రోజుల క్రితం​ కశ్మీర్‌లో‌ బీజేపీ అధ్యక్షుడిని కలిసినందున ఆయన క్వారంటైన్‌కు వెళ్లినట్లు ప్రకటించారు. 

చదవండి: ఆ ద‌శ‌కు భార‌త్ ఇంకా చేరుకోలేదు

మరిన్ని వార్తలు