25 లక్షలు పలికిన గాంధీ పెయింటింగ్‌

26 Oct, 2019 04:29 IST|Sakshi

ప్రధాని మోదీ అందుకున్న జ్ఞాపికల ప్రదర్శన, ఈ–వేలంలో గాంధీజీ చిత్రం అత్యధికంగా రూ.25 లక్షలు పలికింది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన ప్రదర్శన, ఈ–వేలం సెప్టెంబరు 14న ప్రారంభమై శుక్రవారంతో ముగిసింది. ఈ వేలం ద్వారా 2,772 జ్ఞాపికలు అమ్ముడయ్యాయి. ఇందులో అతి తక్కువగా గణేశ్‌ విగ్రహం రూ. 500, అత్యధికంగా గాంధీ పెయింటింగ్‌ రూ. 25లక్షలు పలికింది. ఈ సొమ్మును నమామి గంగా మిషన్‌కు  ఇవ్వనున్నారు.  

మరిన్ని వార్తలు