పరోక్ష యుద్ధంతో పాక్‌ గెలవలేదు : రక్షణ మంత్రి

30 Nov, 2019 14:24 IST|Sakshi

సాక్షి, ముంబై : భారత్‌తో ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేమని భావించిన పాకిస్తాన్‌, ఉగ్రవాదుల ద్వారా పరోక్ష యుద్ధం చేస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. శనివారం పుణెలోని నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన సైనికాధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. పాకిస్తాన్‌ ఉగ్రవాదం ద్వారా భారత్‌పై పరోక్ష యుద్దం చేస్తోంది. కానీ ఏ పద్ధతిలోనైనా సరే. పొరుగు దేశం ఎన్నటికీ మనపై గెలవజాలదని వెల్లడించారు. 

>
మరిన్ని వార్తలు