చికిత్స కోసం విదేశాలకు వెళ్లనున్న పరీకర్‌

6 Mar, 2018 02:46 IST|Sakshi
గోవా సీఎం మనోహర్‌ పరీకర్‌

పనాజీ: కొంతకాలంగా క్లోమ గ్రంధి సమస్యతో బాధపడుతోన్న గోవా సీఎం మనోహర్‌ పరీకర్‌ ముంబైలోని ఆస్పత్రిలో చేరారు. అక్కడి వైద్యుల సూచన మేరకు విదేశాలకు వెళ్లనున్నట్లు సీఎంవో కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. చికిత్స నిమిత్తం ఆయన అమెరికా వెళ్లనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

సీఎం రాష్ట్రంలో లేని సమయంలో పాలనాపరమైన సూచనలిచ్చేందుకు ‘కేబినేట్‌ సలహా కమిటీ’ఏర్పాటైంది.పరీకర్‌ నేతృత్వంలో సోమవారం ఇక్కడ జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయించారు. బీజేపీకి చెందిన సీనియర్‌ మంత్రి ఫ్రాన్సిస్‌ డిసౌజా, గోవా ఫార్వార్డ్‌ పార్టీ(జీఎఫ్‌పీ)కి చెందిన విజయ్‌ సర్దేశాయ్, మహారాష్ట్రవాదీ గోమంత్రక్‌ పార్టీ(ఎమ్‌జీపీ)కి చెందిన పలువురు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. సీఎం పలువురు పోలీసు ఉన్నతాధికారులతో కూడా సమావేశమయ్యారు.

మరిన్ని వార్తలు