ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

23 Nov, 2016 00:10 IST|Sakshi

డెహ్రాడూన్: జీపు లోయలో పడ్డ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని అల్మోరా ప్రాంతంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. అధికారుల కథనం ప్రకారం.. వేగంగా వెళ్తున్న ఓ జీపు అదుపుతప్పి అల్మోరా ప్రాంతంలోని లోయలో పడింది.

దీంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు మృతిచెందారని చెప్పారు. గాయపడ్డవారిని రక్షించేందుకు సిబ్బంది యత్నిస్తున్నారు. అయితే వీరు ఒకే కుటుంబానికి చెందినవారా.. ఎవరు అన్నది తెలియరాలేదు. బాధితుల పూర్తి వివరాలూ తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు