ఎయిర్‌ హోస్టెస్‌కు వేధింపులు

12 Dec, 2016 15:01 IST|Sakshi
ఎయిర్‌ హోస్టెస్‌కు వేధింపులు

ఢిల్లీ: విమానంలో ప్రయాణిస్తున్నవారు ఎయిర్‌హోస్టెస్‌తో అనుచితంగా ప్రవర్తించిన ఘటన ఎయిర్‌ ఇండియా విమానంలో చోటు చేసుకుంది. విమానం సిడ్నీ నుంచి ఢిల్లీకి వస్తున్న సమయంలో ఐదుగురు విదేశీయులు ఎయిర్ హోస్టెస్‌ను వేధింపులకు గురిచేసినట్లు సమాచారం.

ఎయిర్ హోస్టెస్‌ ఫిర్యాదు మేరకు వేధింపులకు పాల్పడిన వారిపై కేసు నమోదైంది. విమానయాన చట్టంలోని సెక్షన్ 22 ప్రకారం ఐదుగురు నిందితులపై చర్యలుంటాయని అధికారులు వెల్లడించారు.

 

మరిన్ని వార్తలు