కాక్‌పిట్‌ తలుపులు పగలగొడతా

5 Jan, 2020 02:43 IST|Sakshi

పైలట్‌లను బెదిరించిన ప్రయాణికుడు

న్యూఢిల్లీ: ఎయిర్‌ ఇండియా సిబ్బందిని ప్రయాణికులు దూషించడంతోపాటు వారిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం ఢిల్లీ–ముంబై వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా ఏఐ865 అనే విమానం పలు సాంకేతిక కారణాలతో ఆలస్యమైంది. దీంతో ఆగ్రహం చెందిన ఆ విమానంలోని ఓ ప్రయాణికుడు పైలట్‌లను బయటకు రావాలని లేకపోతే కాక్‌పిట్‌ తలుపులు పగులగొట్టి లోపలికొస్తానని బెదిరించాడని సమాచారం. అలాగే ఒక మహిళా ప్రయాణికురాలు సిబ్బందిలోని ఓ వ్యక్తిపై దాడి చేసి ప్రధాన ద్వారం తెరవాల్సిందిగా ఒత్తిడి చేసినట్లు ఎయిర్‌లైన్స్‌ వర్గాలు తెలిపాయి.  ఘటనపై తగు చర్యలు తీసుకోవాలని ఎయిర్‌ ఇండియా యోచిస్తోంది.

మరిన్ని వార్తలు