'కేంద్రం పార్లమెంటును ఖాతరు చేయలేదు'

19 Feb, 2014 02:18 IST|Sakshi
'కేంద్రం పార్లమెంటును ఖాతరు చేయలేదు'
 టీ బిల్లును ఆమోదించిన తీరుపై మమతా బెనర్జీ ధ్వజం
 న్యూఢిల్లీ: లోక్‌సభలో తెలంగాణ బిల్లును ఆమోదించడంలో యూపీఏ ప్రభుత్వం పార్లమెంటును ఖాతరు చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దుయ్యబట్టారు. బిల్లు ఆమోదం పొందిన తీరుపై తమ పార్టీ ఎంపీలు రాష్ట్రపతిని కలిసి నిరసన తెలియజేస్తారన్నారు. ‘‘బిల్లుకు ఆమోదం లభించిన తీరు చట్టవిరుద్ధం. దీన్ని ఖండించేం దుకు మాటలు రావట్లేదు. పార్లమెంటును యూపీఏ ప్రభుత్వం ఖాతరు చేయ లేదు’’ అని మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
 
మరిన్ని వార్తలు