మెహబూబాతో పార్టీ నేతల మీటింగ్‌కు గవర్నర్‌ ఓకే

6 Oct, 2019 21:03 IST|Sakshi

శ్రీనగర్‌: గృహనిర్బంధంలో ఉన్న జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీని ఆ పార్టీ నేతలు సోమవారం కలవనున్నారు. 10 మంది నాయకులతో కూడిన పీడీపీ బృందం ముఫ్తీతో భేటీ అయ్యేందుకు గవర్నర్ సత్యపాల్ మాలిక్ అనుమతి ఇచ్చారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఆగస్ట్ 4 నుంచి మెహబూబా ముఫ్తీ గృహనిర్బంధంలో ఉన్నారు.
 
అబ్దుల్లాను కలిసిన ఎన్సీ నేతలు
రెండు నెలలుగా గృహ నిర్బంధంలో ఉన్న నేషనల్​ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా పార్టీ నేతలను కలుసుకున్నారు. ఎన్​సీ​ జమ్మూ అధ్యక్షుడు దేవేందర్​ సింగ్​ రానా నేతృత్వంలో 15మంది సీనియర్‌ నాయకులు ఫరూక్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ ఆయ్యారు. జమ్మూకశ్మీర్‌లో తాజా పరిస్థితులపై చర్చించారు.

మరిన్ని వార్తలు