పోలవరం ప్రాజెక్టుపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌

9 Oct, 2019 15:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు ఈ మేరకు పిటిషన్ వేశారు. ప్రాజెక్టు అంచనాలు పెంచారని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లో అవకతవకలు జరిగాయని అందులో పేర్కొన్నారు. పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు .. దీనిని ఫిర్యాదుగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని కేంద్ర జలవనరులశాఖకు ఆదేశాలు జారీచేసింది.

>
మరిన్ని వార్తలు