13వ రోజూ పెరిగిన పెట్రో ధరలు

19 Jun, 2020 08:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  దేశీయంగా పెట్రోలు, డీజిలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా 13వ రోజు  నేడు (శుక్రవారం) కూడా పెట్రో ధరలు పెరుగుదలను నమోదు చేశాయి.  పెట్రోలుపై 55 పైసలు, డీజిల్‌పై  63 పైసలు చొప్పున ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తాజాగా ధరలను పెంచాయి.


ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిలు ధరలు లీటరుకు
న్యూఢిల్లీ : పెట్రోలు రూ. 78.37,  డీజిల్ రూ.77.06
ముంబై : పెట్రోలు రూ. 85.21, డీజిల్  రూ.75.53
చెన్నై: పెట్రోలు ధరూ. 81.82,  డీజిల్  రూ.74.77

హైదరాబాద్ : పెట్రోలు  రూ. 81.36,  డీజిల్ రూ.75.31
అమరావతి : పెట్రోలు  రూ. 81.76,  డీజిల్ రూ.75.73


 

మరిన్ని వార్తలు