తూత్తుకుడి: పోలీస్‌స్టేషన్‌పై పెట్రోబాంబ్‌ దాడి

26 May, 2018 10:54 IST|Sakshi

తూత్తుకుడి : స్టెరిలైట్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా కొన్ని రోజులుగా నిరసనలతో అట్టుడుకుతున్న తూత్తుకుడి ఇంకా రగులుతునే ఉంది. పోలీసులను లక్ష్యంగా చేసుకుని శనివారం దుండగులు పెట్రోల్‌ బాంబు దాడి చేశారు. తూత్తుకుడిలోని పోలీసుస్టేషన్‌పై పెట్రోల్‌ బాంబు విసిరారు. పోలీసులపై రాళ్లతో దాడి చేస్తూ.. తరుముతున్న ఆందోళనకారులు. నాలుగు రోజుల క్రితం పోలీసుల కాల్పుల్లో 13 మంది ఆందోళనకారులు మరణించిన విషయం తెలిసిందే. అయినా నిరసనకారులు వెనక్కి తగ్గట్లేదు. 

ఇది చదవండి: రణరంగంగా తూత్తుకుడి

>
మరిన్ని వార్తలు