మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

17 May, 2016 09:26 IST|Sakshi
మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

పెట్రోల్‌పై 83 పైసలు, డీజిల్‌పై రూ.1.26

 న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై లీటరుకు 83 పైసలు, డీజిల్‌పై రూ.1.26 పెరిగింది. పెంచిన ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) వెల్లడించింది. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.63.02కు, డీజిల్ ధర రూ.51.67కు పెరిగింది.

ఈ నెలలో ఇదో రెండో పెంపు. మే 1న పెట్రోల్‌పై రూ.1.06, డీజిల్‌పై రూ.2.94 పెరిగిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరల పెంపు, రూపాయి- డాలర్ మారకపు విలువ పెంపుతో పెట్రో ధరలను పెంచినట్లు ఐఓసీ తెలిపింది.

మరిన్ని వార్తలు