పెట్రోల్, డీజిల్ ధర పైపైకి

20 Jun, 2020 08:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశీయంగా ఇంధన ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. వరుసగా 14వ రోజు శనివారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. గత రెండు వారాలుగా పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 51 పైసలు, డీజిల్ ధర 61 పైసలు చొప్పున పెరిగింది. (13వ రోజూ పెరిగిన పెట్రో ధరలు)

ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిలు ధరలు లీటరుకు 
న్యూఢిల్లీ : పెట్రోలు రూ. 78.88,  డీజిల్ రూ.77.67
ముంబై : పెట్రోలు రూ. 85.70, డీజిల్  రూ.75.11
చెన్నై: పెట్రోలు ధరూ. 82.27  డీజిల్  రూ.75.29

హైదరాబాద్ : పెట్రోలు  రూ. 81.88,  డీజిల్ రూ.75.91
అమరావతి : పెట్రోలు  రూ. 82.27  డీజిల్ రూ.76.30

మరిన్ని వార్తలు