భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

16 Mar, 2016 19:01 IST|Sakshi
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

న్యూఢిల్లీ : వాహనదారులకు భారీ షాక్.  ఇప్పటికీ పెరిగిన ధరలతో సతమతం అవుతున్న ప్రజలకు ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు మరింతగా పెరిగాయి. లీటరు పెట్రోల్ ధర ఏకంగా రూ.3.07, డీజిల్ రూ.1.90 పెరిగింది. కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఈ మేరకు నిర్ణయించాయి. పెంచిన ధరలు  గురువారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.

 

కొత్త ధరల ప్రకారం నాలుగు ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రోల్ ఢిల్లీలో రూ.59.68, కోల్కతాలో రూ.63.76, ముంబయి రూ.65.79, చెన్నైలో రూ.59.13 పైసలకు పెరగనుంది. చివరిగా చమురు ధరలు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేవపెట్టిన ఫిబ్రవరి 29న పెట్రోల్ ధర తగ్గగా, డీజిల్ ధర పెరిగిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు