ఐపీఎల్‌పై హైకోర్టులో పిల్

11 Apr, 2016 20:32 IST|Sakshi
ఐపీఎల్‌పై హైకోర్టులో పిల్

బెంగళూరు : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్‌ల విషయమై కర్ణాటక హైకోర్టులో సోమవారం ప్రజాహిత వాజ్యం దాఖలైంది. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితుల వల్ల తాగునీటి విషయమై ప్రజలు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని అయితే ఐపీఎల్ కోసమంటూ ఎక్కువ పరిమాణంలో నీటిని స్టేడియంలోని పిచ్‌లను తడపడం సరికాదంటూ నగరానికి చెందిన శ్రీనివాస్‌శర్మ అనే అర్చకుడు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.

అంతేకాకుండా సదరు నీటిని కూడా జలమండలి అక్రమంగా సరఫరా చేస్తోందని ఫిర్యాదుదారుడు న్యాయస్థానానికి తెలిపారు. అందువల్ల చిన్నస్వామి స్టేడియంకు వినియోగించే నీటిపై ఆడిట్‌ను జరపాల్సిన అవసరం ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

>
మరిన్ని వార్తలు