అమ్మవారికి పూజ.. చోరి!

27 May, 2017 08:37 IST|Sakshi
అమ్మవారికి పూజ.. చోరి!

కాన్పూర్‌: నగరంలోని బాబుపుర్వా ప్రాంతంలో గల జుంగ్లీదేవీ ఆలయం చోరికి గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలయ చోరికి వచ్చిన ఇద్దరు దొంగలు తొలుత అమ్మవారికి పూజ చేసినట్లు చెప్పారు. ఆ తర్వాత అమ్మవారి మూల విరాట్టు పాదాలకు నమస్కరించి ఆభరణాలను చోరి చేశారని తెలిపారు. చోరికి గురైన ఆభరణాల విలువ రూ.7 లక్షల ఉంటుందని వివరించారు.

ఇందుకు సంబంధించిన క్లిప్పింగ్స్‌ ఆలయంలో గల సీసీటీవీ ఫుటేజిలో లభ్యమైనట్లు వెల్లడించారు. బుధవారం అర్ధరాత్రి ఆలయంలో చోరి జరిగినట్లు వివరించారు. గురువారం ఆలయ తాళాలు పగులగొట్టి ఉండటం, ఆభరణాలు మాయం అవడంతో స్ధానికులు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు