‘ఉగ్ర’సాయంపై ఉక్కుపాదం

5 Dec, 2016 01:10 IST|Sakshi
‘ఉగ్ర’సాయంపై ఉక్కుపాదం

హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సులో ప్రధాని మోదీ పిలుపు
- మాపై పాక్ అప్రకటిత యుద్ధం: ధ్వజమెత్తిన అఫ్గాన్ ప్రధాని ఘనీ
- నిందలేయటం సులభమే: పాక్ ప్రధాని సలహాదారు సర్తాజ్ అజీజ్
- సదస్సు ముగింపు సందర్భంగా డిక్లరేషన్ విడుదల
 
 అమృత్‌సర్: హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సు వేదికగా పాక్, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ప్రధాని మోదీ, అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రా ఫ్ ఘనీ నిప్పులు చెరిగారు. పాక్ మద్దతుతో ఉగ్రవాదం పెచ్చుమీరటం వల్ల ఆసియా ప్రాంత భద్రత ప్రమాదంలో పడిందని మోదీ అన్నారు. పాక్ పేరును ప్రస్తావించకుండానే ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివారం జరిగిన సద స్సు ముగింపు సభలో పిలుపునిచ్చారు. అఫ్గానిస్తాన్‌లో శాంతి నెలకొల్పేందుకు ఆ దేశం చేస్తున్న ఒంటరి ప్రయత్నాలు సరిపోవని అందరూ మద్దతుగా నిలవాలన్నారు. కాగా, తమపై పాక్ అప్రకటిత యుద్ధం చేస్తోందని.. దీన్ని వెంటనే ఆపేయాలని అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దుయ్యబట్టారు. మరోవైపు, భారత్, అఫ్గాన్ వ్యాఖ్యలను పాక్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ ఖండించా రు. ప్రపంచ శాంతికి విఘాతంగా నిలుస్తున్న ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు చేయాల్సిన అవసరం ఉందని సదస్సు తీర్మానించింది. హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సులో లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ సంస్థల పేర్లు (ఉగ్ర సంస్థలుగా) పేర్కొనటం ఇదే తొలిసారి.

 కఠినంగా వ్యవహరించాలి: మోదీ
 ‘ఉగ్రవాదానికి మద్దతిస్తూ, ఉగ్రవాదులకు శిక్షణ, రక్షణ, ఆర్థికసాయం చేస్తున్న వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలి. ఉగ్రవాదం కారణంగానే అఫ్గాన్‌లో శాంతి, స్థిరత్వం ప్రమాదంలో పడింది’అని ప్రధాని మోదీ అన్నారు. రక్తపాతం సృష్టిస్తూ, భయాందోళనకు కారణమవుతున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌పై అంతర్జాతీయ సమాజం సంయుక్తంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్ని నొక్కిచెప్పారు. ‘శాంతికి కేంద్రంగా అఫ్గాన్‌ను నిర్మించటంలో మనమంతా పునరంకితమవుదాం. శాంతి నెలకొన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. అప్పుడే ప్రజాస్వామ్యం, బహుళత్వం విజయం సాధించినట్లు’ అని అన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయటం మనం తక్షణం చేయాల్సిన అతిపెద్ద పని అన్నారు.

 పాక్‌ది అప్రకటిత యుద్ధం: అష్రాఫ్ ఘనీ
 అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ.. పాకిస్తాన్‌పై నేరుగా విమర్శలు చేశారు. 2014 శీతాకాలం నుంచి పాక్ తమపై అప్రకటిత యుద్ధం చేస్తోందన్నారు. సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాకిస్తాన్ కొంతకాలంగా దాడుల తీవ్రతను పెంచిందన్న ఘనీ.. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు అంతర్జాతీయ నిధిని ఏర్పాటుచేయాలన్నారు. ఉగ్రవాదంపై ప్రపంచానికి వాస్తవాలు తెలియాలన్నారు. అఫ్గాన్‌కు అదనంగా కోటి డాలర్ల సాయం చేసేందుకు ముందుకొచ్చిన భారత్‌కు ఘనీ కృతజ్ఞతలు తెలిపారు.

 ఉగ్రవాదులంతా ఒక్కటే: జైట్లీ
 విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తరపున  ఈ సదస్సులో పాల్గొన్న ఆర్థిక జైట్లీ.. ఉగ్రవాదంపై సంయుక్త పోరు చేయాల్సిందేనన్నారు. తాలిబాన్, హక్కానీ నెట్‌వర్క్, అల్‌కారుుదా, దారుుష్ (ఐసిస్), లష్కరే తోరుుబా, జైషే మొహమ్మద్ తదితర సంస్థలు భయోత్పా తానికి అడ్డుకట్టవేయాలన్నారు.

 అఫ్గాన్ పరిస్థితి ఆందోళన కరం: అజీజ్
 ఉగ్రవాదం విషయంలో భారత్, అఫ్గాన్ విమర్శలపై పాక్ విదేశాంగ సలహాదారు సర్తాజ్ అజీజ్ తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదం విషయంలో ఒక దేశంపై నిందలేయటం సులభమేనన్నారు. ‘హింస, ఉగ్రవాదం కారణంగానే అఫ్గాన్‌లో జనాలు చనిపోతున్నారు. దీన్ని పరిష్కరించేందుకు ముందడుగేయాలి. ఒక దేశంపై నిందలేయటం సులభమే. పీవోకేలో దాడుల నేపథ్యంలోనూ నేను ఈ సమావేశానికి రావటం.. అఫ్గనిస్తాన్‌తోపాటు ఆసియాలో శాంతి నెలకొల్పడంలో పాకిస్తాన్ చిత్తశుద్ధికి నిదర్శనం’అని అజీజ్ అన్నారు. నవంబర్లో ఇస్లామాబాద్‌లో జరగాల్సిన సార్క్ సదస్సు వారుుదా పడటం వల్ల ప్రాంతీయ సహకారానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందన్నారు. ప్రాంతీయ అనుసంధానత, ఆర్థికాభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ)పై ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్లు అజీజ్ వెల్లడించారు. తన ప్రసంగంలో అజీజ్ ఎక్క డా జమ్మూకశ్మీర్ ప్రస్తావన తీసుకురాకపోవటం విశేషం. కాగా, అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయాన్ని అజీజ్ సందర్శించాలనుకున్నా.. భద్రతా కారణాలరీత్యా భారత్ అభ్యంతరం తెలిపింది. అంతకుముందు, చైనా విదేశాంగ సహాయ మంత్రి కాంగ్ జువాన్యోతో భేటీ అయిన అజీజ్.. భారత భద్రత సలహాదారు అజిత్ దోవల్‌తోనూ కాసేపు మాట్లాడారు.
 
 హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సు తీర్మానాలు
► భారత్ - ఇరాన్ - అఫ్గానిస్తాన్ మధ్య కుదిరిన త్రైపాక్షిక ఛబహార్ రవాణా ఒప్పందం కారణంగా మధ్య ఆసియాకు ప్రపంచ మార్కెట్లతో బంధం మరింత బలపడుతుందని తీర్మానం తెలిపింది.
► ‘ఈ ప్రాంతంలోని ఉగ్రవాద సురక్షిత స్థావరాలను నిర్మూలించాలి. వారికందే ఆర్థిక, వ్యూహాత్మక, ఆయుధ సాయాన్ని అడ్డుకోవాలి. లష్కరే, జేషే, దాయిష్, హుక్కానీ తదితర ఉగ్ర సంస్థలు సృష్టిస్తున్న హింసపై ఆందోళన చెందుతున్నాం’ తీర్మానంలో పేర్కొంది.  
► అఫ్గాన్‌లో హిజ్బే ఇస్లామీ గుల్బుద్దీన్ హెక్‌మత్యార్ సంస్థతో.. ప్రభుత్వం జరి పిన శాంతి చర్చలపై హర్షం వ్యకమైంది.
► చైనా-అఫ్గన్‌లను కలుపుతూ నిర్మిస్తున్న సిల్క్ రోడ్ ఎకనమిక్ బెల్ట్ ఒప్పందాన్ని సమావేశంలో స్వాగతించారు.
► అఫ్గన్ శరణార్థులు తిరిగి వస్తుండటంతో ఎదురవుతున్న సమస్యలతో అంతర్జాతీ య సాయానికి పిలుపునిచ్చారు.
► ఆసియా దేశాల్లో జరుగుతున్న పలు అభివృద్ధి ప్రాజెక్టుల అమలుపై హర్షం.
► అఫ్గనిస్తాన్‌లో ఉత్పత్తవుతున్న నల్ల మందు, మాదకద్రవ్యాల రవాణాను అరికట్టాలని నిర్ణయం

మరిన్ని వార్తలు