న్యూఢిల్లీః మాజీ ప్రధాని దివంగత నేత, రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఇవాళ వీర్ భూమిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు రాజీవ్ గాంధీ నివాళులర్పించారు.
రాజీవ్ గాంధీ 72వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లు సహా కొందరు ప్రముఖులు ఢిల్లీ వీర్ భూమిలో జరిగిన జయంతి కార్యక్రమంలో పాల్గొని పుష్పగుచ్ఛాలతో రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు.
Remembering former PM Rajiv Gandhi ji on his birth anniversary.
— Narendra Modi (@narendramodi) 20 August 2016