ధర్మశాలలో మోదీ.. అభివృద్ధిపై ప్రశంసలు

7 Nov, 2019 16:58 IST|Sakshi

ధర్మశాల: ప్రధానమంత్రి నరేంద్రమోదీ హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో పర్యటిస్తున్నారు. ఆ రాష్ట్ర సీఎం జైరాం థాకూర్‌, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ ప్రధానికి పుష్పాలతో స్వాగతం పలికారు. ధర్మశాలలో జరుగుతున్న రైజింగ్‌ హిమాచల్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ భేటీని ప్రధాని మోదీ ప్రారంభించి ప్రసంగించారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా హిమాచల్‌ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని గడిచిన రెండేళ్లలో హిమాచల్‌ ప్రదేశ్‌ గణనీయ అభివృద్ధిని సాధించిందన్నారు.

మరిన్ని వార్తలు