‘గౌరీ’ హత్య కేసులో మరో అరెస్ట్‌

4 Mar, 2018 03:38 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: గత ఏడాది సెప్టెంబర్‌లో హత్యకు గురైన సాహితీవేత్త, పాత్రికేయురాలు గౌరీలంకేశ్‌ హత్య కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం పురోగతి సాధించింది. ఈ హత్య కేసులో గోవాకు చెందిన వ్యక్తిని ప్రధాన సూత్రధారిగా గుర్తించింది. ఇతడే మహారాష్ట్రకు చెందిన ఇద్దరు షార్ప్‌ షూటర్లతో లంకేశ్‌ను హత్య చేయించినట్లు విచారణలో వెల్లడైంది. లంకేశ్‌ హంతకులే బెంగళూర్‌కు చెందిన సాహితీవేత్త భగవాన్‌ను గత నెల హత్య చేయడానికి పథకం రచించినట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు