రామ మందిరం కోసం పోలీస్‌ ప్రతిజ్ఞ

3 Feb, 2018 02:53 IST|Sakshi
హోంగార్డ్స్‌ డీజీ సుర్యకుమార్‌ శుక్లా

లక్నో: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి బహిరంగంగా మద్ధతు పలికిన డీజీపీ స్థాయి అధికారి కొత్త వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. మూడు రోజుల క్రితం రామ మందిర నిర్మాణంపై లక్నో యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో హోంగార్డ్స్‌ డీజీ సుర్యకుమార్‌ శుక్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ మందిర నిర్మాణం సత్వరమే చేపట్టాలంటూ ఆయన చేసిన ప్రమాణం శుక్రవారం సామాజిక మాధ్యమాలు, టీవీల్లో ప్రసారమైంది. ‘రామ భక్తులమైన మనం ఈ కార్యక్రమంలో భాగంగా రామ మందిర నిర్మాణానికి పూనుకుందాం. జై శ్రీరాం!’ అని శుక్లా అన్నట్లు వీడియోలో కనిపించింది.

మరిన్ని వార్తలు