రాష్ట్రపతి టీచరైన వేళ

5 Sep, 2016 13:48 IST|Sakshi

ఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో ఉపాధ్యాయ దినోత్సవ(గురుపూజోత్సవం) వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్రపతి ప్రణబ్ ఒక పూట ఉపాధ్యాయుడిగా మారారు. సర్వోదయ పాఠశాలలోని విద్యార్థులకు చక్కగా పాఠాలు బోధించారు.

మరోపక్క, గురుపూజోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కార కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగింది. జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన వారికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పురస్కరాలు అందజేశారు.

మరిన్ని వార్తలు