కోయంబత్తూర్ పేలుళ్ల ప్రధాన నిందితుడు అరెస్ట్

31 Jul, 2014 19:19 IST|Sakshi
మల్లాపురం: కోయంబత్తూర్ పేలుళ్ల కేసులో నిందితుడు కుంజు మహ్మద్‌ ను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలోని మల్లాపురంలో కుంజు మహ్మద్‌ను అరెస్ట్ చేసినట్టు తమిళనాడు సీబీసీఐడీ పోలీసులు తెలిపారు. 
 
1998లో అద్వానీ బహిరంగసభలో కుంజు మహ్మద్‌ బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. నాటి ఘటనలో 58 మంది మృతి చెందగా, సభకు ఆలస్యంగా రావడంతో నాడు అద్వానీకి ప్రాణాలకు ముప్పు తప్పింది. 
 
మరిన్ని వార్తలు