చీరలు కట్టుకుని తమిళ రైతుల నిరసన

16 Apr, 2017 16:43 IST|Sakshi
చీరలు కట్టుకుని తమిళ రైతుల నిరసన

న్యూఢిల్లీ: కరవు సాయం కోరుతూ నెల రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్న తమిళ రైతులు శుక్రవారం వినూత్నంగా ఆందోళనకు దిగారు. చీలు కట్టుకుని రహదారులపై నడుస్తూ కరవు సాయం మంజూరు చేయండి అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తీవ్ర కరవు పరిస్థితుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న రైతుల పుర్రెలు ఇవేనంటూ వాటిని పట్టుకుని ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. తామంతా కావేరి నదీమాత బిడ్డలమని, అందుకే చీరలు కట్టుకున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు