కశ్మీర్‌లో మరో ఉగ్రవాది హతం

4 Jul, 2017 10:49 IST|Sakshi

శ్రీనగర్‌ : సరిహద్దులు దాటి దేశంలో చొరబడి విధ్వంసం సృష్టించాలన్న ఉగ్రవాదులను ఎత్తుగడలను భారత ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతోంది. తాజాగా మంగళవారం ఉదయం భద్రతా బలగాల చేతిలో మరో ఉగ్రవాది హతమయ్యాడు. కాగా జమ్మకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో బెహ్మనో ప్రాంతంలో భద్రతా దళాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు మరణించారు. అయితే వారి మృతదేహాలను తెచ్చే క్రమంలో మరో ఉగ్రవాది గ్రెనేడ్‌ను పేల్చుకోవడంతో నలుగురు జవాన్లకు గాయాలయ్యాయి. సంఘటనా స్థలం నుంచి ఒక AK-47 తుపాకీ, ఇన్సాస్‌ రైఫిల్‌ను సైనిక వర్గాలు స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు కూంబింగ్‌ కొనసాగుతోంది.

 

>
మరిన్ని వార్తలు