మరో ‘పుల్వామా’ తప్పింది!

3 Mar, 2019 04:24 IST|Sakshi

శ్రీనగర్‌: పుల్వామాలో ఫిబ్రవరి 14న సీర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఆత్మాహుతిదాడికి పాల్పడ్డ జైషే ఉగ్రవాది ఆదిల్‌ అహ్మద్‌ దార్‌ 40 మంది జవాన్లను బలికొన్న సంగతి తెలిసిందే. అయితే ఇదే తరహాలో ఆత్మాహుతి దాడి చేసేందుకు ఓ ఉగ్రవాది సిద్ధమైనట్లు పోలీసులు తెలిపారు. జైషే మొహమ్మద్‌ ఉగ్రసంస్థకు చెందిన రకీబ్‌ అహ్మద్‌ భద్రతాబలగాలపై ఆత్మాహుతి దాడి చేయాలని ప్రణాళిక రచించినట్లు వెల్లడించారు. కానీ కుల్గామ్‌లోని తురిగామ్‌లో 24న జరిగిన ఎన్‌కౌంటర్‌లో రకీబ్‌ సహా ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతమయ్యారు. ‘మీరు ఈ వీడియోను చూసేలోగా నేను స్వర్గంలో ఉంటాను’ అని రకీబ్‌ మాట్లాడిన వీడియో శనివారం సోషల్‌మీడియాలో షేరింగ్‌ అవుతోంది. ఏ రకంగా ఆత్మాహుతిదాడి చేయబోతున్నానో వీడియోలో రకీబ్‌ చెప్పాడు. ఆదిల్‌ దార్, రకీబ్‌లకు సంబంధించిన వీడియోల మధ్య సారూప్యత ఉందన్నారు.  

భారత్‌ కాల్పుల్లో నలుగురు దుర్మరణం
ఇస్లామాబాద్‌: నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట భారత బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు, ఇద్దరు పౌరులు చనిపోయారని పాకిస్తాన్‌ ఆర్మీ ఆరోపించింది. నైకాల్‌ సెక్టార్‌లో పాక్‌ ఆర్మీ పోస్టులు లక్ష్యంగా భారత బలగాలు కాల్పులు జరిపాయని తెలిపింది.

మరిన్ని వార్తలు