రాహుల్ వచ్చారు.. మీటింగ్ పెడుతున్నారు

11 Jan, 2016 09:12 IST|Sakshi
రాహుల్ వచ్చారు.. మీటింగ్ పెడుతున్నారు

న్యూఢిల్లీ: యూరప్ పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ భారత్ తిరిగి వచ్చారు. ఆయన సోమవారం పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటుచేశారు. తాను యూరప్ పర్యటనలో ఉండగా జరిగిన పరిణామాలేమిటి అన్నదానిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. గతంలో రాహుల్గాంధీ విదేశీ పర్యటనలపై తీవ్ర ఊహాగానాలు చెలరేగిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో డిసెంబర్ 28న తాను యూరప్ పర్యటనకు వెళ్తున్నట్టు ఆయన ట్విట్టర్లో ప్రకటించారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి.. ఆయన కొత్త సంవత్సరాన్ని విదేశాల్లో జరుపుకొన్నారు. గత ఏడాది కూడా ఆయన కొత్త సంవత్సర వేడుకల్ని విదేశాల్లోనే జరుపుకొన్నారు. అప్పట్లో ఏఐసీసీ సదస్సుకు కూడా ఆయన హాజరుకాకపోవడంతో బీజేపీ రాహుల్ పై, కాంగ్రెస్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు