న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆహార భద్రతా పథకంలో ఎలాంటి వృథాకు తావులేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ అన్నారు. వేల సంవత్సరాల దేశ చరిత్రలో తొలిసారిగా ఎవరూ ఆకలితో బాధపడకుండా చేసే పథకమిదని పేర్కొన్నారు. త్వరలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మంగళవారం నిర్వహించిన ఒక బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు.