ఉపాధి హామీపై పోరుకు సిద్ధమౌతున్న కాంగ్రెస్

5 Feb, 2016 11:48 IST|Sakshi
ఉపాధి హామీపై పోరుకు సిద్ధమౌతున్న కాంగ్రెస్

ఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, దీనిపై దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించడానికి ఈ సమావేశంలో వ్యూహరచన చేస్తున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి హాజరయ్యారు.

యూపీఏ ప్రభుత్వ హయాంలో కీలకం ఉన్న ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చి పదేళ్లు అవుతున్న సందర్భంగా అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి కూలీలకు భరోసా సభ నిర్వహించిన విషయం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు