బాపు బాటలో నడుస్తా: రాహుల్ గాంధీ

3 Oct, 2013 12:51 IST|Sakshi
బాపు బాటలో నడుస్తా: రాహుల్ గాంధీ

తాను మహాత్మా గాంధీ సిద్ధాంతాలను పాటిస్తానని, ఆయన అనుచరుడినని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. రెండు రోజుల పర్యటన కోసం గురువారం గుజరాత్ వచ్చారు. ఇక్కడి గాంధీ సబర్మతి ఆశ్రమాన్ని రాహుల్ సందర్శించారు. ఆశ్రమంలో అరగంటకుపైగా గడిపారు.

సబర్మతి ఆశ్రమానికి రావడాన్ని ఎప్పుడూ గౌరవంగా భావిస్తానని రాహుల్ సందర్శకుల పుస్తకంలో రాశారు. ఆయన ఆలోచనలు ఆదర్శనీయమని కొనియాడారు. గుజరాత్ పర్యటనలో భాగంగా రాహుల్.. అహ్మదాబాద్, రాజ్కోట్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం గురించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

>
మరిన్ని వార్తలు