సహృదయత చాటుకున్న రాహుల్‌ గాంధీ

28 Mar, 2019 05:08 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన సహృదయతను చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ జర్నలిస్టును స్వయంగా తన కారులో తీసుకెళ్లి ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో జరిగే ఓబీసీ సదస్సులో పాల్గొనేందుకు బుధవారం ఉదయం రాహుల్‌ బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో స్థానిక జర్నలిస్ట్‌ రాజీందర్‌ వ్యాస్‌ హుమయూన్‌ రోడ్డు పక్కన పడిపోయి ఉండటాన్ని గమనించారు. వెంటనే కారును ఆపిన రాహుల్‌.. రాజీందర్‌ను తన కారులో ఎక్కించుకుని ఎయిమ్స్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం తిరిగి ఓబీసీ సమావేశంలో పాల్గొనేందుకు తిరిగి బయలుదేరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

>
మరిన్ని వార్తలు