పుట్టింగళ్ ఆలయాన్ని పరిశీలించిన రాహుల్

11 Apr, 2016 06:39 IST|Sakshi

కొల్లాం: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం కేరళలో అగ్నిప్రమాదం సంభవించిన పుట్టింగళ్ ఆలయానికి వెళ్లారు. బాణసంచా పేలుడు కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన కుటుంబాలను ఆయన పరామర్శించారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోని, కేరళ హోం మంత్రి చెన్నితల రమేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 107 మంది మృతి చెందగా, రెండు వందల మందికి పైగా భక్తులు గాయపడ్డారు.
 

మరిన్ని వార్తలు