దక్షిణ కోస్తా ఓఎస్‌డీగా శ్రీనివాస్‌ నియామకం

8 Mar, 2019 20:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఢిల్లీ: కొత్తగా ఏర్పడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఓఎస్‌డీ(ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ)గా శ్రీనివాస్‌ను నియమించినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. శ్రీనివాస్‌ దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ బ్లూ ప్రింట్‌ తయారు చేయనున్నారు. ఉద్యోగుల బదిలీ, విశాఖలో జోన్‌ ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, డీపీఆర్‌ తయారీ తదితర అంశాలను ఓఎస్‌డీ శ్రీనివాస్‌ పర్యవేక్షించనున్నారు. శ్రీనివాస్‌ ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో చీఫ్‌ పర్సనల్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు