రైల్వే ప్లాట్ఫామ్ టిక్కెట్ ధర పెంపు!

23 Mar, 2015 23:27 IST|Sakshi
రైల్వే ప్లాట్ఫామ్ టిక్కెట్ ధర పెంపు!

న్యూఢిల్లీ: వచ్చే నెల 1 నుంచి ప్లాట్‌ఫాం టిక్కెట్ల రేట్లను రైల్వేశాఖ పెంచనుంది. ప్రస్తుతం రూ.5 గా ఉన్న ప్లాట్‌ఫాం టిక్కెట్ ధర రూ.10కి పెంచనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. పెరిగిన ధరలతో కూడిన టిక్కెట్లను అన్ని రైల్వే స్టేషన్లకు సకాలంలో సరఫరా చేయాలని జోనల్ రైల్వేలను రైల్వే శాఖ ఆదేశించింది.

ర్యాలీలు, ఉత్సవాల సందర్భంలో ప్లాట్‌ఫాంలపై రద్దీని నియంత్రించేందుకు టిక్కెట్ రేట్లను పది రూపాయలకంటే ఎక్కువగా పెంచేందుకు డివిజనల్ రైల్వే మేనేజర్లకు రైల్వేశాఖ అధికారం కల్పించింది.

మరిన్ని వార్తలు