ఆ రైళ్లలో ఎల్‌సీడీ స్ర్కీన్‌లకు టాటా!

17 Mar, 2018 12:33 IST|Sakshi
తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ (ఫైల్‌)

రైల్వే ప్రయాణీకులకు కొత్త అనుభూతిని కలిగించడానికి తేజస్‌, శతాబ్ది రైళ్లలో ఏర్పాటు చేసిన ఎల్‌సీడీ స్ర్కీన్‌లతో రైల్వేశాఖకు కొత్త సమస్య వచ్చిపడింది. ఈ రైళ్లలో ప్రతి ప్రయాణికుడి సీటు ముందు ఏర్పాటు చేసిన  ఎల్‌సీడీ స్ర్కీన్‌లను ప్రయాణీకులు ధ‍్వంసం చేయడం, కొంతమంది వాటి హెడ్‌సెట్‌లను తీసుకెళ్తున్నారనీ, ఇంకొంతమందైతే ఆ ఎల్‌సీడీ స్క్రీన్‌లనే తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారనీ రైల్వే వ్యవస్థ వాపోతోంది. పగిలిన స్ర్కీన్‌లను మళ్లీ అమర్చాలన్నా, కొత్తవాటిని తీసుకురావాలన్నా వాటికి ఖర్చు ఎక్కువ అవుతోందని అసలు ఎల్‌సీడీ స్ర్కీన్‌లనే రైల్లోంచి తీసేయాలని రైల్వే యంత్రాంగం ఆలోచిస్తుంది. బొంబాయి నుంచి గోవాకు వెళ్లే ఈ రైళ్లను నడపాలంటే రైల్వేవ్యవస్థ వ్యయప్రయాసలకు గురవుతోందట.

మరిన్ని వార్తలు