ఐఆర్‌సీటీసీలో టికెట్ బుకింగ్ ఇక ఈజీ!

13 Aug, 2014 01:52 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐఆర్‌సీటీసీ ద్వారా రైళ్ల టికెట్లను బుక్ చేయడంలో ఎదురవుతున్న కష్టాలకు ముగింపు పలుకుతూ.. కొత్త తరం ‘ఈ టికెటింగ్’ వ్యవస్థను రైల్వే శాఖ ప్రారంభిస్తోంది. పూర్తిగా ఆధునీకరించిన ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను రైల్వే మంత్రి సదానంద గౌడ బుధవారం ప్రారంభించనున్నారు. ఆ వెబ్‌సైట్‌లో ఆధునీకరణ తరువాత టికెట్ బుకింగ్ సామర్థ్యం నిమిషానికి ప్రస్తుతం ఉన్న 2000 టికెట్ల నుంచి 7200 టికెట్లకు పెరుగుతుంది.

మరిన్ని వార్తలు