ప్రీమియర్‌ రైళ్లలో సినిమాలు చూడొచ్చు

15 May, 2017 00:44 IST|Sakshi
ప్రీమియర్‌ రైళ్లలో సినిమాలు చూడొచ్చు

న్యూఢిల్లీ: ప్రీమియర్‌ రైళ్లలో ప్రయాణించే వారు త్వరలోనే తమ ల్యాప్‌టాప్, మొబైల్‌ ఫోన్లలో టీవీ సీరియల్స్, సినిమాలు చూసే అవకాశం లభించనుంది.

ఆదాయం పెంచుకునే చర్యల్లో భాగంగా రైల్వే శాఖ కంటెంట్‌ ఆన్‌ డిమాండ్‌ సర్వీసుతో పాటు రేడియో సర్వీసును తీసుకురానుంది. కంటెంట్‌ ఆన్‌ డిమాండ్‌ సర్వీసును పొందేందుకు ప్రయాణికులు కొంత రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. రేడియో సర్వీసును మాత్రం ఉచితంగా అందించనున్నారు. మొదటగా రాజధాని, శతాబ్ది, దురంతో, హమ్‌సఫర్‌ రైళ్లలో ఈ సర్వీసును ప్రవేశపెడతారు.

మరిన్ని వార్తలు