‘ఐదింటికి లేచి ఆ అవగాహన పెంచండి’

7 Jun, 2016 20:31 IST|Sakshi

కోట(రాజస్థాన్): బహిరంగ మలవిసర్జన నిర్మూలన, విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అవగాహన కోసం ఉదయం ఐదింటికే పాఠశాల ప్రాంతాల్లో మలవిసర్జనకు పాల్పడే వారిని ఫొటో తీయాలని ప్రభుత్వ ఉపాధ్యాయులను రాజస్తాన్‌లోని కోట జిల్లా విద్యాశాఖ ఆదేశించింది.

టీచర్లు వారి పరిధిలో రోజూ ఇలాంటి ఫొటోలు తీసి నివేదికను జతచేసి వాట్సప్‌లో అధికారులకు పంపాలని పేర్కొంది. దీనిపై దీనిపై ఉపాధ్యాయినిలు మండిపడుతున్నారు. సీఎం వసుంధర రాజే ప్రాతినిథ్యం వహిస్తున్న ఝలావాడ్‌లో ఈ ఘటన జరిగింది.
 

మరిన్ని వార్తలు