పెషావర్ ఘటన అమానవీయం: రాజ్నాథ్

16 Dec, 2014 15:46 IST|Sakshi

న్యూఢిల్లీ: పాకిస్థాన్లో పెషావర్ ఆర్మీ స్కూల్పై ఉగ్రవాద దాడిని భారత హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల చేతిలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు రాజ్నాథ్ సానుభూతి తెలియజేశారు. ఉగ్రవాదుల చర్య అమానవీయమని అన్నారు. ఉగ్రవాదుల వికృతచేష్టకు ఈ ఘటన పరాకాష్టని రాజ్నాథ్ ట్విట్టర్లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు