తొలి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించారు!

3 Jun, 2018 17:50 IST|Sakshi

న్యూఢిల్లీ : రాష్ట్రపతి అయిన తర్వాత మొదటి క్షమాభిక్ష పిటిషన్‌ను రాంనాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు. ఐదుగురు చిన్నారులతో సహా ఏడుగురు కుటుంబ సభ్యులను అతికిరాతంగా సజీవదహనం చేసిన ఓ నిందితుడికి సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. 2006లో బిహార్‌కు చెందిన విజేంద్ర మహతో, ఆయన కుటుంబ సభ్యులను జగత్‌రాయ్‌ అనే వ్యక్తి అతి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఉరిశిక్ష విధించగా.. తనకు క్షమాభిక్ష పెట్టాలంటూ ఈ ఏడాది ఏప్రిల్‌ 23న దోషి జగత్‌రాయ్‌ రాష్ట్రపతి కోవింద్‌కు విజ్ఞప్తి చేసుకున్నాడు. అయితే ఏడుగురిని హతమార్చి, దహనం చేసిన వ్యక్తికి క్షమాభిక్ష ఇవ్వడానికి రాష్ట్రపతి అయిష్టత చూపించారు. జగత్‌రాయ్‌ అభ్యర్థనను తిరస్కరించినట్లు రాష్ట్రపతి భవన్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది.

>
మరిన్ని వార్తలు