ఆయిల్‌ ట్యాంక్‌ పగలడంతో.. 

12 May, 2020 16:48 IST|Sakshi

చెన్నై : తమిళనాడులో ఓ ట్యాంకర్‌ ప్రమాదానికి గురవడంతో.. వేల లీటర్ల రిఫైండ్‌‌ ఆయిల్ రోడ్డుపాలయింది. చెన్నై నుండి సేలం జిల్లా అత్తూర్‌కు ఆయిల్‌ లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్‌ కామరాజనగర్‌లో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయిల్‌ ట్యాంక్‌ పగిలిపోయింది. దీంతో వేలలీటర్ల ఆయిల్ వృథాగా పోయింది. స్థానికులు గిన్నెలు, బిందెలతో ఆయిల్‌ను పట్టుకునేందుకు పోటీ పడ్డారు.

మరిన్ని వార్తలు