సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవాల్లో ప్రదర్శించబోయే శకటాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలు చేసిన ప్రతిపాదనలను కేంద్ర రక్షణ శాఖ పరిశీలించింది. శకటాల ఎంపికకు వివిధ రాష్ట్రాలు చేసిన ప్రతిపాదనలను పరిశీలించడానికి కేంద్ర రక్షణ శాఖ కమిటీ బుధవారం సమావేశమైంది. ఏపీ ప్రభుత్వం బుర్రా గుహలను, తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ శకటాలను ప్రతిపాదించింది. వీటిని పరిశీలించిన కమిటీ పలు సలహాలు, సూచనలు చేసింది. 18న జరగనున్న సమావేశంలో ఈ మార్పులను చేస్తూ ప్రతిపాదనలు చేయాలని కోరింది. శకటాల తుది ఎంపిక ఇంకా జరగాల్సి ఉంది.