ఊహించినదే.. నథింగ్ స్పెషల్: నితీశ్

19 May, 2016 16:11 IST|Sakshi

పట్నా: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించినవే అని, ప్రత్యేకతేమీ లేదని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు. కాగా తమిళనాడులో అన్నాడీఎంకే, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, అసోంలో బీజేపీ, కేరళలో ఎల్డీఎఫ్ కూటమి, పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకోనుంది. మరోవైపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ...గెలుపు సారధిలుకు అభినందనలు తెలిపారు. యూపీలో జరిగిన రెండు అసెంబ్లీ స్థానాలను సమాజ్వాదీ పార్టీ తిరిగి కైవసం చేసుకుంది.

 

మరిన్ని వార్తలు