లోయలో పడిన బస్సు : ఐదుగురు మృతి

31 Jan, 2018 07:38 IST|Sakshi

మీర్జాపూర్‌ ( యూపీ ) : ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళుతున్న ఓ బస్సును లారీ ఢీకొట్టడంతో, అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు భక్తులు మృతిచెందగా, మరో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.

మరిన్ని వార్తలు