రైళ్లలో ఈవ్‌టీజింగ్‌ చేస్తే మూడేళ్ల జైలు

24 Sep, 2018 06:00 IST|Sakshi

న్యూఢిల్లీ: రైళ్లలో మహిళలను వేధించే వారికి కనీసం మూడేళ్ల జైలు శిక్ష పడేలా రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ యోచిస్తోంది. ఈ దిశగా రైల్వే చట్టంలో మార్పులు చేసేలా ప్రతిపాదన తెస్తోంది. ఇది కార్యరూపం దాలిస్తే భారత శిక్షాస్మృతిలో పేర్కొన్న శిక్ష కన్నా.. ఈ శిక్ష భారీగా ఉండే అవకాశం ఉంది. ‘ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే మేం వేగంగా స్పందించేందుకు వీలవుతుంది’’ అని రైల్వే అధికారి ఒకరు చెప్పారు. రైళ్లలో మహిళలపై నేరాలకు సంబంధించి 2014–16 మధ్య కాలంలో 1,607 కేసులు నమోదయ్యాయి.

>
మరిన్ని వార్తలు