అయ్యప్ప ఆదాయం రూ. 243.69 కోట్లు

18 May, 2017 14:46 IST|Sakshi
తిరువనంతపురం: దేశవ్యాప్తంగా దీక్ష తీసుకునే స్వాములు, భక్తుల సందర్శనతో శబరిమలలో అయ్యప్పస్వామి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. 2016-17 సంవత్సరానికి అన్ని రకాల ఆదాయాలు కలిపి స్వామివారికి రూ.243.69 కోట్లు వచ్చాయని రాష్ట్ర దేవస్వోమ్‌ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ గురువారం అసెంబ్లీలో ప్రకటించారు. నవంబర్‌- జనవరి మధ్య కేవలం హుండీ ద్వారానే రూ.89.70 రాగా, అప్పం విక్రయాలతో రూ.17.29 కోట్లు వచ్చినట్లు వివరించారు. దీంతో పాటు ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.46.14 కోట్లు మంజూరు చేసిందని ఆయన వివరించారు.
>
మరిన్ని వార్తలు