కొడుక్కి బొమ్మ కొనడానికి వెళ్లి..

31 Mar, 2016 13:56 IST|Sakshi
కొడుక్కి బొమ్మ కొనడానికి వెళ్లి..

కన్న కొడుక్కి సంతోషాన్ని పంచేందుకు వెళ్లిన  ఓ  తండ్రి తిరిగిరాని లోకాలకు తరలిపోయాడు. తమిళనాడులోని అత్తూరుకు చెందిన సగ్గు బియ్యం ఫ్యాక్టరీ యజమాని బాలాజీ(28)ని రోడ్డుప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. తమిళనాడులోని సేలం జిల్లాలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది.

బాలాజీ తన స్నేహితుడితో కలిసి కుమారునికి బొమ్మ కొందామని సేలం వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో వాల్పడి దగ్గర ప్రమాదం జరిగింది. ఇతని కారు, ఎదురుగా వస్తున్న మినీలారీ మీదికి దూసుకుపోయింది. దీంతో బాలాజీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో గాయపడిన స్నేహితుడు కోలుకుంటున్నాడని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు